Header Banner

జగన్‌పై ఓ రేంజ్‌లో పైర్ అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి! కుటుంబాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం..

  Tue Jun 03, 2025 15:07        Politics

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై (Former Chief YS Jagan Mohan Reddy) దాడి కేసును ఎదుర్కుంటున్న బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (Retired IPS officer AB Venkateswara Rao) పరామర్శించారు. ఈరోజు (మంగళవారం) గులకారయి కేసులో నిందితులు సతీష్ ఇంటికి ఏబీ వెళ్లారు. సతీష్ తల్లిదండ్రులు, పిల్లలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని, శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. లేనిపోని దాన్ని తీసుకుని మభ్యపెట్టి రాజకీయం చేశారని విమర్శించారు. ఒక్క వడ్డెర కులస్తుడు జీవితాన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఫైర్ అయ్యారు. బలహీనుడు కాబట్టి సతీష్‌ను బలి చేశారు, 45 రోజులు సతీష్‌ను జైలులో పెట్టారన్నారు. ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా నేటికీ తిప్పుతున్నారని అన్నారు. ఈరోజు వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తుని రైలు దగ్ధం కేసు - త్వరలో కొత్త ఉత్తర్వులు!

 

 

వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వింటే గుండె తరుక్కుపోతోందన్నారు. 2 లక్షలు డబ్బులు ఇస్తామని మభ్యపెట్టారని.. కానీ నేటికి అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు ఉన్నారని తెలిపారు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసులపై ఎందుకు చర్య తీసుకోలేదని, సమాజానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. బాధితులు చేసిన తప్పు ఏంటి , ఏ మాత్రం సంబంధం, సాక్ష్యం లేని కేసులో ఎందుకు వాళ్ళు బాధపడాలని అడిగారు. జగన్ ఆకృత్యాలకు ఇది ఒక ఉదాహరణ అని.. ఇప్పటికైనా ఇటువంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధితులను బలి చేసిన బాధ్యులపై ప్రభుత్వం, సీపీ, డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు. కేసు తక్షణమే మూసేయాలని, బెయిల్ బాండ్స్ రద్దు చేసి, వారు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని... అంతేకాకుండా ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వాలని రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాగా.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో సింగ్‌నగర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా గులకరాయు వచ్చి తగిలింది అంటూ హడావుడి జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు జగన్ నుదిటిపై పట్టి వేసుకుని తిరిగారు. ఈ కేసులు వేముల సతీష్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్‌పై సతీష్ విడుదలయ్యారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AB.VenkateswaraRao #Jagan #Comments #GulakrayiCase #YSRCP #AndhraPradesh